ఉచిత డేటా, వాయిస్ కాల్స్ను వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగించిన జియో.. తాజాగా మరో ఆఫర్ ప్రకటించింది. ఇప్పటి వరకు 4G వినియోగదారులకు మాత్రమే జియో సేవలు అందించేది. ఇకపై 3G, 2G యూజర్లకు కూడా విస్తరింపజేసింది. మొదటగా జియో జాయిన్(ఇప్పుడిది జియో4జీవాయిస్ –Jio4GVoice) యాప్ ను మొబైల్ ఫోన్లలో డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ యాప్ ద్వారా జియోఫై డివైజ్ తో కనెక్ట్ కావాలి. అప్పుడు జియోఫై డివైజ్ ను ఉపయోగించి వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, SMSలు చేసుకోవచ్చు. జియోఫైలో 4జీ సిమ్ యాక్టివేట్ అవ్వగానే 3జీ/2జీగా సిమ్ మారిపోతుందని వివరించింది కంపెనీ. ఆపై సేవలన్నీ 4జీ తరహాలోనే ఉచితంగా పొందవచ్చని జియో ప్రకటించింది. 4జీ స్మార్ట్ ఫోన్ లేనివాళ్లను కూడా తనవైపు తిప్పుకునేందుకు ఈ తరహా ఆఫర్ తీసుకొచ్చింది.
No comments:
Post a Comment